'లైగర్' మూవీ 'ఓటిటి' స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయ్యిందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు పూరి జగన్నాథ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించాడు.

ఈ మూవీ లో అనన్య పాండే , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా , మైక్ టైసన్ ఏ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 25 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు హిందీ , తమిళ్ ,  కన్నడ , మలయాళం భాష లలో చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా లైగర్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... లైగర్ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్  సంస్థ కొనుగోలు చేసినట్లు , ఈ మూవీ ని  సెప్టెంబర్ 30 వ తేదీ నుండి  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' సంస్థ  స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. లైగర్ మూవీ ని పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: