ఈటీవీ డ్రామా కంపెనీ.. ఆ లేడీ కండక్టర్ కు.. ఎంత ఇచ్చారో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో ఈ టీవీ వాళ్ళు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రతిభ కలిగిన వారిని తమ షోలలోకీ పిలిపిస్తూ వారికి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అయితే గత కొంత కాలం నుంచి ఈ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి ఎపిసోడ్ లో కూడా కొత్తగా కనిపిస్తున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వారందరినీ కూడా  తెలుగు ప్రేక్షకులకు పరిచయంచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టాలెంట్ ఉన్న వారు శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి వచ్చి తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే కేవలం కామెడీ మిమిక్రీ చేసే వారిని మాత్రమే కాదండోయ్ డాన్సులు చేసే వారూ కూడా వీరు నుంచి పిలుపు అందుకుంటున్నారు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి గాజువాక ఆర్టీసీ డిపోకు చెందిన ఒక లేడీ కండక్టర్ వచ్చింది. ఇక ఆమె చేసిన మాస్ డాన్స్ ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు అని చెప్పాలి. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ అక్కడున్న వారందరూ కూడా లేచి నిలబడి ఆమె డాన్స్ కి చప్పట్లు కొట్టారు. అయితే ఆమె డ్యాన్స్ చేస్తున్నంతసేపు ఈమె ఎవరో సోషల్ మీడియా స్టార్ట్ అయి ఉంటుంది అని అందరూ భావించారు.

 కానీ ఆమె డాన్స్ పర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత తాను గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్ గా పని చేస్తున్నాను అని చెప్పడంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. ఒక కండక్టర్ అయ్యుండి ఇంత టాలెంట్ కలిగి ఉన్నారా అని ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమెను ఎలా పట్టుకు వచ్చారో ఏమోగానీ శ్రీదేవి డ్రామా కంపెనీ వారు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కోసం రెండు రోజులు డేట్స్ కేటాయించిందట ఆమె. ఇందుకోసం మల్లెమాల వారు ఆమెకు రెండున్నర లక్షల వరకు పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ కండక్టర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంతోషం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: