తాజాగా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ నటించిన సినిమా కార్తికేయ 2 .అయితే ఇక ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సందర్భంగా చిత్ర బృందం కర్నూలులో వేడుక నిర్వహించింది. ఇక భాజపా నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకకి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.ఇకపోతే వేడుకనుద్దేశించి నిఖిల్ మాట్లాడుతూ.. ''బాహుబలి', 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్చరణ్, ఎన్టీఆర్లు తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. అంతేకాదు 'కార్తికేయ 2' హిందీలో డబ్ అయి, ఉత్తరాదిన విడుదలవుతుందంటే నాకు భయమేసింది...
హీరో 'నిఖిల్ ఏంటి? బాలీవుడ్కి వెళ్లడమేంటి?' అని నాలాగే మీరూ అనుకున్నారు కదా. విడుదలయ్యాక పరిస్థితి మారింది.అయితే దేశవ్యాప్తంగా ఈ సినిమా 1200 స్క్రీన్స్లో ప్రదర్శితమవుతోంది. ఇక ఇది 'కార్తికేయ 2' విజయం కాదు తెలుగు సినిమా విజయం. అంతేకాకుండా మనం గర్వపడాల్సిన సందర్భమిది. సిచిత్ర యూనిట్ సినిమాని పెద్దగా ప్రమోట్ చేయలేదు.అంతేకాదు మీ అంతట మీరే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఇకపోతే యువత, పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్.. ఇలా ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కాదు, ఓ ఎమోషన్.
పోతే మీరు నాపై, సినిమాపై చూపిస్తున్న ప్రేమే నాకు రూ.100 కోట్లతో సమానం '' అని నిఖిల్ భావోద్వేగంతో మాట్లాడారు.అయితే ''2014లో నా స్నేహితురాలు నా ఫొటోలని ఆడిషన్కి పంపింది.అయితే అనుకోకుండా నేను ఆ సినిమాకి ఎంపికయ్యా. ఇక ఆ చిత్రమే 'ప్రేమమ్'. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది.ఇదిలావుంటే 2017లో నేను నటించిన 'శతమానం భవతి' సినిమాని మీరు ఆదరించారు.ఇక వాటి తర్వాత నా కెరీర్లో నిలిచేపోయే చిత్రం 'కార్తికేయ 2'. విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'' అని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో దర్శకుడు చందు మొండేటి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..!!