వైరల్ అవుతున్న పూరి కామెంట్స్...!!

murali krishna
మహేష్ బాబు కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో పోకిరి సినిమా కూడా ఒకటనే విషయం తెలిసిందే. మహేష్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


అప్పట్లోనే ఈ సినిమా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత మహేష్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో బిజినెస్ మేన్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించిందనే విషయం తెలిసిందే.


ఈ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కితే బాగుంటుందని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలకు సీక్వెల్స్ గురించి పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారట.. బిజినెస్ మేన్ మూవీని త్వరలో హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉందని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలకు సీక్వెల్స్ చేయాలని గతంలో నేను, మహేష్ అనుకున్నామని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.


అప్పటి పరిస్థితులు, తర్వాత సినిమాల కమిట్మెంట్ల వల్ల ఈ సినిమాలకు సీక్వెల్స్ చేయడం సాధ్యం కాలేదని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. అటు పండుగాడు రోల్ అన్నా ఇటు సూర్యభాయ్ రోల్ అన్నా నాకు ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. అన్నీ కలిసొస్తే పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలకు త్వరలో సీక్వెల్స్ చేద్దామని ఆయన కామెంట్లు కూడా చేశారు. ఈ రెండు సీక్వెల్స్ కూడా మహేష్ బాబుతోనే చేస్తానని ఆయన కామెంట్లు చేశారు.


పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్ల వల్ల ఈ ప్రాజెక్ట్ లపై మహేష్ ఫ్యాన్స్ అంచనాలను పెంచుకుంటున్నారు. అయితే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తైన తర్వాతే మహేష్ పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో మహేష్ ఈ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి మరి….

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: