'కార్తికేయ 2' కి నిఖిల్ రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా..?

Anilkumar
తాజాగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'కార్తీకేయ-2' బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్నది.అంతేకాదు  బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేస్తున్న ఈ ఫిల్మ్ ..అంచనాలను మించి వసూళ్లు చేస్తు్న్నది.అయితే నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం 'కార్తీకేయ' ను మించి ప్రజలకు నచ్చుతున్నదని సినీ పరిశీలకులు చెప్తున్నారు.ఇకపోతే కృష్ణతత్వంతో పాటు హిస్టరీ వర్సెస్ మైథాలజీ అనే అంశంపైన దర్శకుడు సినిమాలో చక్కగా చర్చించారు. ఇక ముఖ్యంగా అనుపమ్ ఖేర్ పాత్ర రాగానే థియేటర్లలో జనాలు హ్యాపీగా ఫీలవుతున్నారు.

అంతేకాదు  'ధన్వంతరి వేద్ పాఠక్'గా అనుపమ్ ఖేర్ చెప్తున్న మాటలు విని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే  మొత్తంగా సినిమా ఇంకా నెక్స్ట్ లెవల్ లోకి వెళ్తుందని చెప్తున్నారు సినీ ప్రియులు.అయితే ఇక ఈ సినిమా రిలీజ్ టైమ్ లో హీరో నిఖిల్ చాలా టెన్షన్ పడ్డారు.పోతే  రిలీజ్ డేట్ విషయమై తము కొంచెం ఆలస్యంగా వస్తు్న్నామని బాధపడ్డారు.అయితే  కానీ, రిలీజ్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఎలాంటి బజ్ లేకుండానే సినిమాను దేశవ్యాప్తంగా విశేషంగా ఆదరిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లు ఇంటర్వ్యూల్లో హీరో నిఖిల్ పేర్కొన్నారు.

పోతే ఈ సినిమాకు నిఖిల్ కేవలం రూ.మూడున్నర కోట్లు మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిన 'కార్తీకేయ-2' ఇంకా రికార్డు వసూళ్లు చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ లో కుమ్మేస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ మార్క్ ను టచ్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. వన్ మిలియన్ తో ఆగకుండా అక్కడ కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే కార్తికేయ 2 లో.. పార్ట్ 3 గురించి చివర్లో కొన్ని సీన్స్ చూపించడంతో పార్ట్ 3 పై కూడా భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. దీంతో వీలైనంత త్వరగా 'కార్తీకేయ-3' కూడా రావాలని ఈ సందర్భంగా సినీ ప్రియులు కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: