కృష్ణ భగవాన్ కామెడీ టైమింగ్.. జబర్దస్త్ కమెడియన్స్ పైనే పంచులు?

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బుల్లితెరపై గ్రేట్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. ఈ షో తర్వాత ఈ కార్యక్రమానికి పోటీ ఇచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు వచ్చినా అవి జబర్దస్త్ నవ్వుల  సునామీ ముందు నిలవలేకపోయాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్తగా అలరిస్తూ ఉంటుంది. ఇక గత కొంత కాలం నుంచి జబర్దస్త్ లో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. జబర్దస్త్ మొదలైన నాటి నుంచి జడ్జి గా కొనసాగుతున్న రోజా వెళ్లిపోవడంతో  ఆమె స్థానంలో ఇంద్రజ జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.
 సింగర్ మనో వెళ్లిపోవడంతో హీరోయిన్ కుష్బూ  ఆయన స్థానంలో ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో యాంకర్ అనసూయ వెళ్లిపోవడంతో ఇక ఇప్పుడు రష్మీ తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఖుష్బూ స్థానంలో జడ్జి సీట్లోకి టాలీవుడ్ స్టార్ కమెడియన్ కృష్ణభగవాన్ వచ్చాడు అన్నది తెలుస్తుంది. సాధారణంగా కృష్ణ భగవాన్ సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో నే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 అయితే కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా అదే రీతిలో అదిరిపోయే కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తూ  ఉంటాడు కృష్ణ భగవాన్. ఏదైనా బుల్లితెర కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చాడు అంటే చాలు అక్కడ కమెడియన్స్ పై కూడా ఆటో పంచులతో  అదరగొడుతు ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇటీవల జబర్దస్త్ లో జడ్జి సీట్లో కూర్చున్న కృష్ణ భగవాన్ జబర్దస్త్ కమెడియన్స్ కంటే ఎక్కువ కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించాడు. ఇది చూసిన వారు కృష్ణ భగవాన్ కామెడీ టైమింగ్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: