నిర్మాతగా మారిపోతున్న స్టార్ హీరోయిన్..!!

Divya
బాలీవుడ్లో స్టైలిష్ లేడీగా పేరుపొందిన ఎంతోమంది నటీమణులు సైతం నిర్మాతలుగా మారారు. ఈ జాబితాలో మరొక హీరోయిన్ చేరబోతోంది. ఇప్పటివరకు కంగాన రనౌత్, అనుష్క శర్మ, ఆలియా భట్, దీపికా పదుకొనే వంటి హీరోయిన్లు నిర్మాతలుగా చాటుకున్నారు. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు ప్రొడక్షన్ పనులను సైతం నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా వీరిలోకి మరో హీరోయిన్ కరీనాకపూర్ కూడా చేరింది. ఈ ముద్దుగుమ్మ సైతం నిర్మాణంలోకి అడుగు పెట్టబోతోంది మొదటి ప్రయత్నంగా మరొక లేడీ నిర్మాతతో చేతులు కలిపి ఒక సినిమాని నిర్మిస్తున్నది. డైరెక్టర్ హన్సల్ మెహాత నిర్మిస్తున్న చిత్రం ఏక్తా కపూర్ తో కలిసి నిర్మాణంలో పాల్గొనింది.
ఈ విషయాన్ని కరీనాకపూర్ స్వయంగా విడుదల చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని బెబో గత సంవత్సరం తెరకెక్కించాల్సి ఉంది.. కానీ కొన్ని కారణాల చేత ఇది ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది. ఇప్పటికే స్క్రిప్ట్ తో సహా అన్ని రకాల పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఏక్తా తో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిస్తోంది అని సినిమాలలో నటించడం కంటే బరువైన బాధ్యతలు మోయాల్సి వస్తోంది అంటూ తెలియజేసింది. నటిగా ఎంపిక అయితే ఆ పాత్ర షూటింగ్ పూర్తి అయ్యేవరకు అక్కడితో మన బాధ్యతలు పూర్తి అయిపోతుంది . కానీ నిర్మాణం అంటే మొదలు దగ్గర నుంచి ముగింపు వరకు ప్రతి పనిని చాలా దగ్గరుండి చూసుకోవాలని తెలిపారు ఈమె.

అయితే ఇలాంటి పనులు అన్నీ చేయడం చాలా తేలికైన విషయం ఏమీ కాదు. ముందు నేను ఫిట్టుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలనని కరీనాకపూర్ తెలియజేసింది. కరీనాకపూర్ లాల్ సింగ్ చద్దా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా భారీ నిరాశ మిగిల్చింది. ఈ పరాజయం నుంచి కరీనా తొందరగానే బయటపడింది.. ఇక తన తదుపరి ప్రాజెక్టులను చాలా వేగవంతంగా పూర్తి చేయాలని ఉత్సాహంతో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోని ఈమె నిర్మాతగా తన కొత్త సినిమా గురించి విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: