ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమానికి 'కార్తికేయ 2' టీమ్ విచ్చేసి సందడి చేసింది.ఇక దానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఇక ఇందులో దర్శకుడు చందూ మొండేటి..ఇకపోతే సీనియర్ హీరో నాగార్జనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.కాగా ఆయనతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడాడు.ఇదిలావుంటే తనకు అగ్ర కథానాయకుడు నాగార్జున అంటే చాలా ఇష్టమని ఆయనతో ఓ పోలీస్ కథపై చర్చలు జరుపుతున్నానని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. అయితే నాగార్జునతో 'విక్రమ్'లాంటి పవర్ఫుల్ స్టోరీతో సినిమా చేస్తానని చెప్పారు.
ఇకపోతే చందూ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన చిత్రం 'కార్తికేయ2'. కాగా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ క్రమంలో నిఖిల్తో కలిసి చందూ మొండేటి ఆలీ షోకు వచ్చి సందడి చేశారు. పోతే ఈ సందర్భంగా ఆలీ అడిగిన సరదా ప్రశ్నలకు అంతే ఫన్నీగా జవాబులు చెప్పారు.ఇకపోతే 'నువ్వొక చిన్న సైజు విజయ్మాల్య అట కదా' అని చందూను అడగ్గా, 'స్కాములా.. దొంగతనం కూడా చేశామంటారు..' అని నవ్వులు పూయించారు.అంతేకాదు 'అదంతా ఒకప్పుడు' అంటూ నిఖిల్ అన్నారు. పోతే 'కార్తికేయ2'లో చాలా పాములు ఉంటాయని చెప్పారు.
కాగా 'భార్యలకు అబద్ధాలు చెప్పకపోతే, ఇన్ని కాపురాలు ఉంటాయా' అంటూ చందూ చెప్పగా, 'చిరాగ్గా ఉన్న సమయంలో ఫోన్ చేసి.. డు యు లవ్ మీ' అని అడుగుతారని నిఖిల్ చెప్పడంతో నవ్వుల పువ్వులు విరిశాయి. కాగా ఆగస్టు 8న ఈ షో టెలికాస్ట్ కానుంది.ఇదిలావుంటే ఇక నిఖిల్ హీరోగా .మరియు అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. పోతే భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక కార్తికేయ 2 విషయానికి వస్తే గతంలో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్ను ఆగస్టు 6న విడుదల చేయబోతున్నారు మేకర్స్...!!