'భవదీయుడు' నుండి హరీశ్ శంకర్ అవుట్.. కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న పవన్..?

Anilkumar
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే మరోపక్క సినిమాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలు విడుదలయ్యాయి.ఇకపోతే  ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇక ప్రముఖ నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.అయితే ఇప్పటికే 60 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. గత రెండు నెలల నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

అయితే సోషల్ మీడియా లో ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి ఎవరికీ తోచిన కథలు వాళ్ళు అల్లుకుంటున్నారు కానీ సరైన కారణం మాత్రం దొరకడం లేదు.ఇదిలా వుండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చాడు అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.పోతే ఆగష్టు నెలలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా తో పాటు బాగా ఆలస్యం అవుతున్న మరో పవన్ కళ్యాణ్ సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'..గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించబోయ్యే ఈ సినిమా ఇప్పటి వరుకు కనీసం పూజా కార్యక్రమాలకు కూడా నోచుకోలేదు.

అయితే ఈ చిత్ర నిర్మాత నవీన్ గారు పవన్ కళ్యాణ్ కి భారీ లెవెల్ లో అడ్వాన్స్ ఇచ్చి దాదాపుగా 7 ఏళ్ళు కావొస్తుంది.ఇకపోతే ఇప్పటి వరుకు డేట్స్ సర్దుబాటు చెయ్యలేకున్నాడు పవన్ కళ్యాణ్.కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనే విషయం పై హరీష్ శంకర్ మరియు నవీన్ ఇదివరకే పవన్ కళ్యాణ్ ని చాలా సార్లు కలిశారు.లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఈ సినిమా నుండి డైరెక్టర్ హరీష్ శంకర్ తప్పుకున్నాడని తెలుస్తుంది.అయితే రెండేళ్ల నుండి ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ ఇప్పటికే సమయం చేతులు దాటిపోవడం తో తన సినీ కెరీర్ రిస్క్ లో పడుతుంది అని భావించి భవదీయుడు నుండి తప్పుకొని హీరో రామ్ తో సినిమా సెట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వద్ద మాత్రమే కాదు, #RRR నిర్మాత DVV దానయ్య వద్ద కూడా ఒక సినిమా చెయ్యడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు.ఇప్పుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ మరియు DVV దానయ్య ఎంటర్టైన్మెంట్స్ రెండిటిని కలిపి ఒకే సినిమా చెయ్యడానికి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నాడట.అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం తో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.అంఅంతేకాదు ఎన్నికల ముందు ఇదే పవన్ కళ్యాణ్ ఆఖరి చిత్రం అని కూడా చెప్పొచ్చు.ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: