మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్.. మహేష్ కూడా..?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది.. ఇక ఈ సినిమా ఫారెస్ట్ ఆఫ్రికన్ నేపథ్యంలో సాగే స్టోరీ అన్నట్లుగా కథను రిలీవ్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం రాజమౌళి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమా స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా బాహుబలి, rrr రికార్డులన్నీ కొల్లగొట్టే స్క్రిప్ట్ తో రాబోతున్నట్లుగా అర్థమవుతుంది.

మొదటిసారి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ ని టచ్ అయ్యేలా.. గ్లోబల్ సినిమాగా ఆవిష్కరించే దిశగా ఈ సినిమా కథను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా కూడా ఒక హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక బాహుబలి ,RRR తరహాలో ఈ సినిమా కథ ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది. ఈ రెండు చిత్రాలు కూడా కొన్ని నవలల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.
ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసే కథలు కూడా ఎక్కువగా ఫిక్షన్ కథలే ఉంటాయి. ఇక ఈ సినిమా కథను బేస్ చేసుకుని విజువల్స్ ఎలా హైలెట్ చేయాలన్న దానిపై కొన్ని హాలీవుడ్ సినిమాలను పూర్తిగా పొందుతూ ఉంటారు. ఇక అలాంటి దాని కోసమే ప్రస్తుతం మహేష్ బాబుకి కథ సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. ఇక విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి కథ రాసినా కూడా వాటిపై కల్కి కృష్ణమూర్తి ప్రభావం ఉంటుందని ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కల్కి కృష్ణమూర్తి ఒక ప్రముఖ నవల రచయిత. ఈయన నవల నుంచి రాజమౌళి తండ్రి ఎన్నో సినిమాలకు కథలు రాసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: