పొన్నియన్ సెల్వన్ చిత్రంపై మరొక వివాదం..!!

Divya
తమిళ సీనియర్ డైరెక్టర్ గా పేరు పొందిన మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మకమైన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా కూడా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందని మణిరత్నంతో పాటు ఆయన అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పవచ్చు. ప్రసిద్ధి రచయిత రాసిన కల్కి నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటిస్తూ ఉండగా నందిని పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తున్నది. ఇక వందియా దేవన్ గా కార్తీ నటిస్తూ ఉన్నారు కుందావాయి గా హీరోయిన్ త్రిష నటిస్తున్నది ఇటీవలే వీరందరికీ సంబంధించి ఒక ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది దీంతో ఈ సినిమాకు మంచి క్రియేట్ ఏర్పడింది అయితే ఈ సినిమా టీజర్ విడుదలైన మొదటి రోజే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పొన్నియన్ సెల్వన్ లో చోళులను చాలా తప్పుగా చిత్రీకరిస్తున్నారు అనే సన్నివేశాలను కొంతమంది ప్రముఖులు ఆరోపించడం జరుగుతోంది.
సెల్వమనే ఒక న్యాయవాది ఈ ఈ సినిమా పైన పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. ఎందుచేత అంటే పోస్టర్లు ముందుగా విక్రం ఆదిత్య కరికాలను పాత్రలో నుదుట తిలకం ఉన్నదని అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ లో మాత్రం అది కనిపించలేదని ఆరోపించారు. అయితే ఈ సినిమాలో ఆదిత్య కరికాలను ఇలా తప్పుగా చూపించే అవకాశం ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి చిత్రబంధం సిద్ధమయింది ఈ సినిమా ఒకేసారి అన్ని భాషల్లో విడుదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: