రేపు ఆ థియేటర్ లను సందర్శించనున్న ది వారియర్ చిత్ర బృందం..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుసగా ఈస్మార్ట్ శంకర్ , రెడ్ వంటి మంచి విజయవంతమైన మూవీ ల తర్వాత తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ పోతినేని తన కెరియర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఈ సినిమా విడుదలకు ముందు నుండే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇది వరకు సరైనోడు మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి ఎంతో మంది  ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆది పినిశెట్టి ది వారియర్ మూవీ లో కూడా తన అదిరిపోయే నటన తో మరో సారి ప్రేక్షకులను అలరించాడు.
 

ఇది ఇలా ఉంటే ది వారియర్ మూవీ జూలై 14 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా ఈ సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ది వారియర్ చిత్ర బృందం రేపు అనగా జూలై 18 వ తేదీన కొన్ని థియేటర్ లను సందర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అందులో భాగంగా రేపు ది వారియర్ చిత్ర బృందం రేపు అనగా జూలై 18 వ తేదీన ... భ్రమరాంబ (కూకట్ పల్లి) , విశ్వనాధ్ (కూకట్ పల్లి) , శ్రీరాములు (మూసాపేట్) థియేటర్ లను సందర్శించనునట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: