ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ..!

Pulgam Srinivas
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ 'గులాబీ' సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ అలా వైవిధ్యమైన సినిమాలతో ఎన్నో విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు .

ఇది ఇలా ఉంటే గులాబీ , నిన్నే పెళ్ళాడుతా , సింధూరం , అనంతపురం ,  ఖడ్గం ,  రాఖి , చందమామ లాంటి వైవిధ్యమైన సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన కృష్ణవంశీ 'చందమామ'  మూవీ తర్వాత మాత్రం మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు . ఇది ఇలా ఉంటే తాజాగా కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కృష్ణవంశీ, జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ , కృష్ణవంశీ కాంబినేషన్ లో రాఖీ సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. చెల్లాలి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది.

అలాగే ఈ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ కు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అదిరిపోయే ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను పని చేసిన హీరోలు తనకు ఎప్పుడు ఎదురైనా ఎంతో బాగా మాట్లాడతారని, ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే, ఒక వేళ ఎన్టీఆర్ కనుక ఇప్పుడు తనని కలిసినా ఏదైనా మంచి కథ ఉంటె చెప్పండి మూవీ చేద్దాం అని అంటారని  కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: