అలా చేయడం వల్లే తన సినిమా ఫ్లాప్ అయిందంటున్నా స్టార్ హీరోయిన్..!!

Divya
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ కంగాన రనౌత్ సుపరిచితమే. మొదటిసారిగా ఏక్ నిరంజన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మ మరే తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఆ తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెట్టి అక్కడ పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా అక్కడ పలు వివాదాల పైన కూడా స్పందిస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాలపై స్పందించడం కూడా జరుగుతూ ఉంటుంది.

ఎటువంటి వారి పైనా సరే తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఉండడం వల్ల ఈమె అంటే ఇండస్ట్రీలో పడని వారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక చివరిగా ధాకడ్ చిత్రంలో నటించిందీ కంగాన రనౌత్. ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఈ చిత్రం కారణంగానే నిర్మాతలు సైతం తమ ఆస్తులు అమ్ముకున్నారనే విధంగా వార్తలు రావడం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఈ ముద్దుగుమ్మ ఖండించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మేరకు నిర్మాత దీపక్ ముకుత్ అంతకుముందు కొన్ని కామెంట్లు చేయడం కూడా జరిగింది.

తాజాగా ఆయన చేసిన కామెంట్లపై స్పందించిన కంగాన రనౌత్ ఆ చిత్రానికి పెట్టిన ఖర్చులను ప్రొడ్యూసర్ తిరిగి పొందినట్లుగా ఆమె తెలియజేసింది. నిర్మాత ఆస్తులు, ఆఫీసులో ఏమి అమ్ముకోలేదని సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తాను సంతృప్తిగానే ఉన్నట్లుగా చెప్పారని తెలిపింది. సినిమా గురించి చేసిన వ్యతిరేక ప్రచారం కారణంగానే ఈ సినిమా చాలా పరాజయం పాలు అయిందని ఆమె తెలియజేస్తున్నట్టుగా తెలిపింది. నెగిటివ్ కామెంట్ చేసేవారు గంగుబాయి కాఠియవాడి, జీగ్ జిగ్ జియో,83 వంటి సినిమాలు ప్లాప్ గురించి ఎందుకు రాయాలని ఆమె ప్రశ్నించింది కానీ తన చిత్రం గురించి  మాత్రం ఎక్కడ చూసినా కనిపిస్తోంది అని తెలియజేసింది. ఈ సినిమా zee-5 లో ప్రసారమవుతున్నది అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: