టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఈయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఇకపోతే అసలు విషయం ఏమిటంటే డైరెక్టర్ శంకర్ రాం చరణ్, కియారా అద్వానీతో ఓ పాటను చిత్రకరించడానికి 1000 మంది డ్యాన్సర్లను ఎంపిక చేశారట.అయితే ప్రస్తుతం పంజాబ్ లొకేషన్స్లో ఆ పాటను వెయ్యి మంది డ్యాన్సర్లతో షూట్ చేస్తున్నాడట.
ఇక ఆ తర్వాత ఈ పాట కొనసాగింపు హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో జరుగుతుందట.ఇకపోతే ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారట.ఇదిలావుంటే ఈ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే మరో భారీ ఫైట్ సీన్కు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నారని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.అయితే ఆ ఫైట్ విషయానికొస్తే.. ఆ యాక్షన్ సీన్లో దాదాపు 1200మంది ఫైటర్స్ పాల్గొంటారట. ఇకపోతే దాదాపు 20 రోజులపాటు ఈ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుందని, ఈ సీక్వెన్స్తో సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తవుతుందట. అంతేకాదు ఆ తర్వాత మిగతా షూట్ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లనుంది.
ఇక దాంతతో 95 శాతం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అయితే, ఇక ఈ సినిమాను 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.అయితే ఇక పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా కోసం పవర్ స్టార్ రాంచరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరాం తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు...!!