చంద్రముఖి-2 లో ఈ హీరోయిన్ నటిస్తోందా..?

Divya
17 సంవత్సరాల క్రితం తెలుగు,తమిళ భాషల్లో పెను సంచలనం సృష్టించిన చిత్రం చంద్రముఖి. అప్పటివరకు ప్లాపుల్లో ఉన్న రజనీకాంత్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా నిలిచి తిరుగులేని ఇమేజ్ ను అందించింది. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతిక ని కూడా సరికొత్త కోణంలో ఆవిష్కరించి ఆమె నటనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక హీరోయిన్ నయనతార కు కూడా ఈ సినిమా ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పి.వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా శివాజీ ప్రొడక్షన్ పై హీరో ప్రభు ,ఆయన సోదరుడు రామ్ కుమార్ నిర్మించడం జరిగింది.
తమిళంలో రూపొందించిన ఈ చిత్రం 2005లో తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల మంచి విజయాన్ని అందించడమే కాకుండా.. 19 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించగా.. రూ.75 కోట్లకు పైగా వసూలు రాబట్టి రజనీకాంత్ సత్తాని చాటుకుంది. ఈ చిత్రాన్ని మలయాళం నుండి రీమిక్స్ చేయడం జరిగింది. మలయాళం లో ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా నటించారు. అయితే ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరోగా రాఘవ లారెన్స్ పి.వాసు డైరెక్షన్లో నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఇటీవలే ఈ సినిమా ను అధికారికంగా కూడా ప్రకటించారు జూన్ 14న ఈ సినిమా మేకర్స్ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడం జరిగింది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో చంద్రముఖి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ త్రిష అని చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఈమెకు భారీగానే ఆఫర్ ఇచ్చినట్లుగా లైకా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక ఇందులో హీరోయిన్ రాశి ఖన్నా, ఆండ్రియా తదితరులు ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు. నయనతార కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: