ఒకప్పుడు తిట్టుకున్నారు ఇప్పుడు కలిసిపోయారు. కారణం..?

Divya
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాత నట్టికుమార్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరు లావాదేవీల విషయంలో పలు వివాదాలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నట్టి కుమారుడు క్రాంతి కుమార్తె కరుణాలు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని వీరిద్దరిపై ఆర్జీవి కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. దీంతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇక నిన్నటి రోజున హై కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.

నట్టి క్రాంతి నట్టి కారణాలు ఫోర్జరీ చేశారు అంటూ వర్మ పెట్టిన కేసులో వారిని అరెస్టు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర న్యాయస్థానం నిన్నటి రోజున స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చును హై కోర్ట్ తెలియజేసింది. ఇదంతా ఇలా ఉండగా వర్మ నట్టికుమార్ ఇద్దరు కూడా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టినట్లు గా ప్రకటించడం జరిగింది. ఇద్దరు స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం ఆన్నట్లుగా కలిసిపోయారు. తామిద్దరి మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న మిస్ అండర్స్టాండింగ్ వంటి వాటికి ఈ రోజున క్లియర్ అయిపోయాయి అని తెలియ జేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
దీంతో ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలన్ని తొలగిపోయి భవిష్యత్తులో మళ్లీ కలిసి పని చేస్తామని వర్మ తెలియజేశారు. నట్టి క్రాంతి, కణాలపై ఎలాంటి ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టలేదని ఆ పర్టికులర్ స్విచువేషన్ లో జరిగి పోయింది తప్ప అంతా బాగానే ఉన్నామని వర్మ తెలిపారు. ఇది కేవలం డబ్బు విషయంలో వచ్చిన తగ్గాదలే తప్ప ఫ్యామిలీ పరంగా ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. నట్టికుమార్ మాట్లాడుతూ వర్మతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: