ఎఫ్-4 లో నటించేది వీరే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!
మొత్తంగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించిన చిత్రంగా సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ను కొనసాగించే పనిలో పడ్డాడు డైరెక్టర్. దీంతో f-4 సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటాయని తెలియజేశారు. అయితే ఇందులో ఎవరెవరు ఉంటారనే విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెంకటేష్ ,వరుణ్ తేజ్ లు కచ్చితంగా ఈ చిత్రంలో ఉంటారు. ఇక వీరిద్దరి తో పాటుగా మరికొంతమంది కూడా యాడ్ అవుతారని ఇటీవల అనిల్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ తమన్నా, మెహరీన్ బదులుగా ఇతర హీరోయిన్స్ ఉంటారని అనిల్ రావిపూడి తెలియజేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్నారు కావున ఈ చిత్రం అయిపోగానే f-4 సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా దాదాపుగా విడుదలయ్యేకి రెండేళ్ల సమయం పడుతుంది అన్నట్లుగా సమాచారం. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు అందుచేతనే ఈ సినిమాలకు సీక్వెల్స్ కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు అనిల్ రావిపూడి. మరెన్ని సీక్వెల్స్ వస్తాయో చూడాలి.