'నయనతార - ఎమ్మెస్ ధోని' సినిమా... డైరెక్టర్ ఎవరో తెలుసా ?
అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధోని మాత్రం ఐపీఎల్ సీజన్ 15 లో చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే నెలలో నయనతార.. విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోనుండగా, అటు ఐపీఎల్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత..అలాగే నయన్ పెళ్లి అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలను ప్రకటించనున్నాని మూవీ వర్గాలు చెబుతున్నారు. అయితే గతంలోనూ ధోని తన జీవిత చరిత్ర ఆధారంగా 2016లో విడుదలైన ఎంఎస్ ధోని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సినీ ఇండస్ట్రీతో కొద్దిగా అనుబంధం కలిగి ఉన్నాడు.
కాగా ఈ సినిమాలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ పాత్రలో నటించగా.. బాలీవుడ్ నటి కియారా అద్వానీ ధోని భార్య సాక్షి సింగ్ పాత్రలో నటించారు. అయితే ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా భారీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న నయన్.. హీరోయిన్ గా ధోని నిర్మిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్రేక్షకులలో ఈ సినిమాపైన క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే ఇప్పటికే నయన్ చేతిలో ఐదు సినిమాలు ఉండగా , ఇంకా డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న సినిమాలలో కూడా నయన్ నటిస్తున్న సంగతి తెలిసిందే..