ఆహా నా రాజా : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే పండగ ... ??

GVK Writings
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను తీసిన అఖండ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు చారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తీసిన అఖండ మూవీ మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ కొట్టి నిర్మాతకి కాసులు కురిపించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన అఖండ లో అఘోరాగా, మధ్యతరగతి రైతుగా రెండు పాత్రల్లో బాలయ్య నటనకు అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది.
ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ వారు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నారు బాలయ్య. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇక దీని తరువాత అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయనున్నారు బాలయ్య. ఈ సినిమా మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో సాగడంతో పాటు బాలయ్య కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచేలా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అనిల్ చెప్పారు.
ఆపైన బి గోపాల్ తో కూడా బాలయ్య ఒక పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేయనున్నారని టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఓవైపు గోపీచంద్ మలినేని కూడా తన లేటెస్ట్ సినిమాలో బాలయ్యని పవర్ఫుల్ పాత్రలో చూపిస్తున్నారని సినిమా మంచి విజయం అందుకోవడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే బాలయ్య కెరీర్ పరంగా రాబోయే సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్నట్లైతే ఆయన ఫ్యాన్స్ కి పండగే పండగ అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: