సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఒక ముద్దుగుమ్మను అనుకోని ఆ తర్వాత ఆ ముద్దుగుమ్మను సంప్రదించగా , ఆ కథ నచ్చకో లేక ఆ సమయంలో డేట్లు సర్దుబాటు చేయలేక పోవడంతో ఆ హీరోయిన్ పాత్రను ఇతర హీరోయిన్లు చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే బాలకృష్ణ నటించిన తాజా సినిమా అఖండ విషయంలో కూడా ఇదే జరిగినట్లు తెలుస్తోంది. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా , పూర్ణ ముఖ్యమైన పాత్రలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
అయితే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కంటే ముందు నలుగురు హీరోయిన్ లను సంప్రదించరట. కాకపోతే వారు ఈ సినిమాలో నటించకపోవడంతో చివరగా ప్రగ్యా జైస్వాల్ కు అఖండ మూవీ లో అవకాశం వచ్చిందట. ఆ నలుగురు హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం... మొదట దర్శకుడు బోయపాటి శ్రీను 'అఖండ' సినిమాలో హీరోయిన్ గా నటింపచేయడానికి రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించాడట, కాకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకు నో చెప్పడంతో బోయపాటి శ్రీను ఆ తర్వాత కాజల్ అగర్వాల్ సంప్రదించాడట, ఈ ముద్దుగుమ్మ కూడా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు నో చెప్పడంతో బోయపాటి శ్రీను , కేథరిన్ సంప్రదించాడట, ఈ ముద్దుగుమ్మ కూడా పలు కారణాల వల్ల ఈ సినిమాకు నో చెప్పడంతో బోయపాటి శ్రీను ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ సంప్రదించారట.
ఈ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాకు నో చెప్పడంతో బోయపాటి శ్రీను , ప్రగ్యా జైస్వాల్ కు అఖండ సినిమా సినిమా కథ ను వినిపించడంతో ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాకు ఓకే చెప్పిందట. అలా చివరకు ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యిందట. అఖండ సినిమా ద్వారా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.