టాలీవుడ్ యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ 'అ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాను ఒక కొత్తరకం కాన్సెప్ట్ తో తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే 'అ' సినిమాతో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న ప్రశాంత్ వర్మ 'అ' మూవీ తర్వాత రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన కల్కి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కల్కి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొన్న ప్రశాంత్ వర్మ , తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన జాంబి రెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిన హనుమాన్ సినిమా ఈ సంవత్సరం విడుదల కానుంది. హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ మరో ప్రయోగాత్మకమైన సినిమాను తెరకెక్కించడానికి సిద్ధం అయ్యాడు.
10 మంది హీరోయిన్ లతో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఒక సినిమాను తెరకెక్కించడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. పది మంది హీరోయిన్ లలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ సెలక్ట్ చేసుకొని ఈ ముద్దుగుమ్మ ని సంప్రదించగా అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సబ్జెక్ట్ విని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగతా హీరోయిన్ లను కూడా మరి కొన్ని రోజుల్లో సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.