బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడీ..ఫ్యాన్స్ కు జాతరే..
అఖండ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాను చూసేందుకు బాలయ్య ఫ్యాన్స్, సినీ అభిమానులు కూడా సినిమాను చూసేందుకు థియేటర్లకు భారీగా తరలి వచ్చారు..మంచి టాక్ ను అందుకోవడంతో సినిమా ఘన విజయాన్ని అందుకుంది. సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఎవరికి ఇస్తారని అనుకున్నారు. బాలయ్య మాత్రం యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్షకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొదటి షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించిన చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రలలో కనిపించనున్నారని టాక్..ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే మొదలైనప్పటికి ఈ సినిమా టీజర్ ను త్వరలో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారట..జూన్ 10 బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..కాగా, ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా శృతి హాసన్ నటించగా, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు..మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాల్సి ఉంది..