బాలీవుడ్ స్టార్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్..!

Pulgam Srinivas
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమాల  విషయాలు మాత్రమే కాకుండా అనేక విషయాల పై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.  ఇలా తనదైన శైలిలో అనేక విషయాలు గురించి స్పందిస్తూ ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది,  ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్,  ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా అలరించింది.

  ఇది ఇలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రస్తుతం లాకప్ షో కు హోస్ట్ ‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే,  కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ మరో సారి బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది,  ఈ మేరకు కంగనా రనౌత్ తన ఇన్ స్టా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది.  బాలీవుడ్ ఇండస్ట్రీ లో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్ వీర్ సింగ్ వంటి చాలా మంది నటులు మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు,  కానీ వారు హోస్ట్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు.  వాళ్లు హోస్ట్ చేయడంలో ఇప్పటివరకు సక్సెస్ కాలేదు,  ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ లు మత్రమే సూపర్ స్టార్ హోస్ట్‏గా ఘనత సాధించి... ఈ లీగ్‏లో ఉండడం విశేషం  అని కంగనా రనౌత్ రాసుకొచ్చింది,  అది మాత్రమే కాకుండా నాపై ఉన్న అసూయతో నేను చేస్తోన్న ఈ షో ను అప్రతిష్టపాలు చేయడానికి చూస్తున్నారు.  కానీ నా షో ను అప్రతిష్టపాలు చేయడం వారి వల్ల కాదు,  నేను నన్ను మరియు నా షో ను రక్షించుకుంటాం అని కంగనా రనౌత్ రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: