హాట్ యాంకర్తో మెగాస్టార్ రొమాన్స్..!!
మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మరిన్నీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అనుకున్న రీతిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. కానీ మెగాస్టార్కు ఆఫర్లు తగ్గలేదు. ఆ తర్వాత ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే వరుసగా చాలా ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. లూసీఫర్కు రీమేక్గా వస్తున్న ‘గాడ్ ఫాదర్’, వేదాళం మూవీకి రీమేక్గా తెరకెక్కిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాల్లో చిరంజీవి నటిస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికమైన వార్త వైరల్ అవుతోంది.
ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేశ్తో కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్తో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రూపొందనుంది. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్. హీరోయిన్గా తమన్నా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కొనసాగుతోంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
భోళా శంకర్ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఇందులో బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో అలరించనున్నారు. అయితే ముఖ్యంగా శ్రీముఖి-చిరంజీవి కాంబినేషన్లో ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఖుషీ’ సినిమాలోని నడుము సీన్ను రిపీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్లో మెగాస్టార్ చిరంజీవి-శ్రీముఖితో కలిసి ఆ నడుము సన్నివేశాన్ని రీక్రియేట్ చేయనున్నారు. చిరంజీవి రొమాంటిక్ సీన్స్, డైలాగ్స్ హైలెట్గా నిలుస్తాయని డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి యాంకర్ శ్రీముఖితో కలిసి రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.