చై - సామ్ మళ్ళీ ఒక్కటి కానున్నారా..?

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత మరియు అక్కినేని వారసుడు నాగ చైతన్య ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనితో వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇకపోతే  వీరిద్దరి దంపతులు సెలబ్రెటీలు సైతం జలసీ గా ఫీల్ అయ్యేలా ఇండస్ట్రీలో హడావిడి చేసేవారు.అయితే  చాలామంది కపుల్స్ కి ఈ జంటకు ఇన్స్పిరేషన్ గా మారారు.ఇక  సమంత- చైతూలని చూస్తే జంట చూడ ముచ్చటగా ఉందని అనేవారు. అయితే అంతలా ఈ జంట అన్యోన్యంగా ఉండేవారు.కాగా  విడాకుల తర్వాత ఎవరికి వారు వారి సినిమాలతో బిజీ అయ్యారు. .

ఇకపోతే లవ్‌స్టోరి, బంగార్రాజుతో నాలుగు నెలల గ్యాప్‌లోనే రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాడు చైతూ .అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'థాంక్యూ', 'లాల్ సింగ్ చద్ధా' సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది కూడా మరెవరితో కాదు సమంత ఫ్రెండ్ నందినీ రెడ్డితో.ఇకపోతే  చై తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను సమంత బెస్ట్‌ఫ్రెండ్‌, డైరెక్టర్‌ నందినీ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారట. కాగా వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు.అయితే  నిజానికి ఈ సినిమాను నాగ చైతన్య, సమంతలతో తీయాలని గతంలో నందినీ రెడ్డి ప్లాన్‌ చేశారట.ఇకపోతే  వీరి విడాకుల వ్యవహారంతో ఈ ప్రాజెక్ట్‌కి కాస్త బ్రేకులు పడ్డాయి.

అయితే కాని ఇప్పుడు మరోసారి చై సరసన మరోసారి సమంతని తీసుకోవాలని నందిని రెడ్డి భావిస్తుందని సమాచారం వినిపిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. అయితే ఇక మెల్లమెల్లగా గొడవలు తగ్గడంతో నందిని రెడ్డి ఆ జంటను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇద్దరు ఒప్పుకుంటే అభిమానులకి కనుల పండుగ అనే చెప్పాలి. ఇదిలావుండగా ఇటీవల సమంత నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అన్ ఫాలో చేసింది.అయితే కానీ ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. నాగ చైతన్య మాత్రం ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను అన్ ఫాలో చేయలేదు.కాగా సమంత .. నాగార్జున, అమల, అఖిల్‌, ఆశ్రిత, రానా దగ్గుబాటిలను మాత్రం ఫాలో అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: