ప్రభాస్, అనుష్క మధ్య మళ్లీ అది జరగబోతుందా..?
అనుష్క 'నిశ్శబ్ధం' సినిమా తర్వాత సైలెంట్ అయిపోయింది. బరువు పెరిగిందని, మునుపటి చార్మ్ లేదనే విమర్శలొచ్చాక కెమెరాలకి కనిపించడం మానేసింది. రీసెంట్గా 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ సెలబ్రేషన్స్లో కనిపించి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేసింది. స్వీటీ ఇంకా మేకర్స్కి టచ్లోనే ఉందని ఆమె ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు. ఈ జోష్ని మరింత పెంచడానికి ప్రభాస్, అనుష్క జోడీని తెరపైకి తీసుకొస్తున్నాడు మారుతి.
ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో 'బిల్లా, మిర్చి, బాహుబలి' సినిమాలు వచ్చాయి. ఈ మూవీస్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీకి బాక్సాఫీస్ కూడా లవ్లో పడిపోయింది. ఈ కెమిస్ట్రీ చూసే హిందీ జనాలు ప్రభాస్, అనుష్క లవ్లో ఉన్నారనుకున్నారు. తర్వాత ఇద్దరూ క్లారిటీ ఇచ్చాక కామెంట్స్ తగ్గిపోయాయి. మరి స్వీటీ లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తోన్న ఈ సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి.
ఇక ప్రభాస్ విషయానికొస్తే.. 'బాహుబలి' తర్వాత మళ్లీ ఫ్యాన్స్ని ఆ రేంజ్లో సాటిస్ఫై చేయలేదు ఈ యంగ్ రెబల్ స్టార్. మాఫియా బ్యాక్డ్రాప్లో చేసిన 'సాహో' మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన 'రాధేశ్యామ్' బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ అంతా 'సలార్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ 'సలార్' సినిమాని ఈ ఏడాది జులైలోనే విడుదల చేయాలనుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ థర్డ్వేవ్తో షూటింగులకి బ్రేకులు పడ్డాయి, షెడ్యూల్స్ మారిపోయాయి. దీంతో ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. దీనికితోడు ప్రభాస్ యూరప్లో మోకాలి సర్జరీ చేయించుకున్నాడని రెండు నెలల వరకు కెమెరాముందుకురావడం కష్టమనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్' సినిమా 'కెజిఎఫ్' తరహాలోనే యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ కంప్లీట్ రెబల్స్టార్లా కనిపించబోతున్నాడు. దీంతో అభిమానులంతా కటౌట్కి తగ్గ సినిమా చేస్తున్నాడని, 'రాధేశ్యామ్' రిజల్ట్ని మరిపిస్తాడనే అంచనాల్లో ఉన్నారు. కానీ వాళ్ల ఆశలని కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ, వచ్చే ఏడాది సమ్మర్కి వెళ్లిపోతోంది 'సలార్'.