ఉత్తరప్రదేశ్ సీఎం ను కలిసిన బండ్ల గణేష్.. కారణం..?

Divya
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో సంచలనంగా మారుతుంటాడు. యాక్టర్, ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు సంపాదించారు బండ్ల గణేష్. అయితే ఈసారి తాజాగా యూపీ సీఎం అయిన యోగి తో బండ్ల గణేష్ మంతనాలు మొదలు పెట్టారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకు సంబంధించి పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాక్టర్ గా ఉండి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను తెరకెక్కిస్తున్నారు బండ్లగణేష్. ఇక అప్పుడప్పుడు రాజకీయాలలోనే వేలు పెట్టి చాలాసార్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. బండ్ల గణేష్ మైకు ముందు వచ్చారు అంటే చాలు ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టిస్తూ ఉంటారు. సినిమాల విషయంలో కూడా బండ్ల గణేష్ మాటలు కూడా కాంట్రవర్సి గా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర రాజకీయాలు కలిసిరాలేదని వార్త కూడా వినిపిస్తోంది. అందుచేతనే జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా జాతీయస్థాయి గుర్తింపు పొందిన రాజకీయ నేతల దగ్గరకు బండ్ల గణేష్ విస్తృతంగా పయనిస్తూనే ఉన్నారు.
అలా ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ కు వరుసగా రెండవ సారి సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఒక ఫోటో ని దిగడం జరిగింది ఆ ఫోటో ని బండ్ల గణేష్ తన ట్విట్టర్లో స్వయంగా పోస్ట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎం కు రెండోసారి బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు బండ్లగణేష్. ఆ పరమేశ్వరుడు తనకి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రదర్శించాలని తెలియజేశాడు. అయితే ఈ ఫోటో చూసిన వారు మాత్రం బండ్ల గణేష్ రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నట్లుగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఎక్కువగా ఎటువంటి వాటిలోకి జోక్యం చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: