దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోయిన్ పరిచయమైంది హన్సిక. ఇక ఈమె తొలి సినిమాతోనే క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టింది ఈ భామ.ఇకపోతే దేశముదురు సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది ఈ క్యూటి.అయితే ఈమె తెలుగుతోపాటు తమిళ్ లోనూ ఈ వయ్యారి అవకాశాలు అందుకుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో హన్సిక జోరు తగ్గిందనే చెప్పాలి. ఇకపోతే కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అయితే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ సినిమాతో రాబోతుంది హన్సిక. కాగా ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రానటువంటి ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో, భిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'మై నేమ్ ఈజ్ శృతి'.
అయితే ఈ సినిమా మనిషి చర్మం వలిచి బిజినెస్ చేసే ఓ గ్యాంగ్తో ఓ యువతి చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇకపోతే ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్.ఇక ఈ సినిమాలో హాన్సిక టైటిల్ రోల్ పోషిస్తుంది. తాజాగా ఇటీవల విడుదలైన టీజర్లో చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అయితే లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ మంచి స్పందన వచ్చింది.అంతేకాదు తాజాగా ఈ సినిమానుంచి 'రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసే లాగా ముప్పే వచ్చే నా వెంట' అంటూ కొనసాగే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు చిత్ర యూనిట్.
అయితే మార్క్రాబీన్ సంగీత దర్శకత్వంలో కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కథానాయిక హాన్సిక మాట్లాడుతూ..ఈ మూవీలో నటించినందుకు ఎంతో ఆనందంగా వుంది.అంతేకాకుండా ఇలాంటి ఓ ఇంటెన్స్ స్టోరీని నేను ఎప్పుడూ చేయలేదు.ఇకపోతే సినిమాలో వుండే ట్విస్ట్లు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. కాగా ఈ మూవీలో ఈ పాట టైటిల్ సాంగ్గా వస్తుంది.దేనితో పాటు ఆమె తప్పకుండా ఈ సాంగ్తో పాటు సినిమా కూడా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.