RGV ఓ మంచి పని చేసాడబ్బా?

praveen
టాలీవుడ్లో కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఎవరు అని ప్రేక్షకులను ఎవ్వరిని అడిగినా అందరూ టక్కున  చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ. ఇక అంతలా టాలీవుడ్లో సెన్సేషనల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు ఆయన. ఒకప్పుడు  సరికొత్త టెక్నాలజీతో వినూత్నమైన ఆలోచనలతో సినిమాలు తీసి టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం సినిమాలతో కాకుండా కేవలం ఆయన పోస్టులతో మాటలతోనే సెన్సేషన్ గా మారిపోతూ ఉన్నారు. ముఖ్యంగా వివాదాస్పద సినిమాలు తెరకెక్కించడంలో ఎప్పుడు ముందుంటున్నారు రామ్ గోపాల్ వర్మ.

 ఇక రామ్ గోపాల్ వర్మ మాట్లాడే మాటలు కొంతమందికి బాగా ఆకర్షిస్తూ ఉంటాయ్. దీంతో ఒక్కరోజయినా రామ్ గోపాల్ వర్మలా ఉండాలి అనుకుంటూ వుంటారు చాలామంది. అదే సమయంలో ఇక రామ్ గోపాల్ వర్మ మాటలు చూసి షాక్ లో మునిగిపోయి తిట్టుకునే వారు   కూడా లేకపోలేదు. అంతే కాదు వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తూ ఎలాంటి విమర్శలు  చేస్తాడో కూడా ఊహకందని విధంగా ఉంటుంది. అయితే ఇక ఎప్పుడూ ఒకరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమేనా వర్మ కి ఏదైనా మంచి పని చేసే బుద్ధి ఉందా అని అనుకున్నారు ఎంతో మంది నెటిజన్లు.

 ఇక ఇప్పుడు వర్మ ఎట్టకేలకు ఒక మంచి పని చేసాడు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పాల్గొంటూ ఒక మొక్క నాటడమే కాదు ఇక మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ విసరడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ స్వప్న విసిరిన ఛాలెంజ్ను సేకరించిన సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీ నగర్ కాలనీ లో మొక్కలు నాటారు. ఇక భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని అన్నారు. అయితే వర్మ మొదటి సారి ఇంత పాజిటివ్ గా ఉండటం తో అందరూ షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: