రామ్ సరసన జాన్వీ కపూర్..?

Anilkumar
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఇటీవలే బాలయ్యకు అఖండ సినిమా రూపంలో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన బోయపాటి ఇప్పుడు రాం తో మొదటి సారి యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకోవాలని చిత్ర యూనిట్ చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో చిత్ర బృందం చర్చలు జరిపింది.

దానికి జాన్వి కపూర్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాదు దాదాపు ఈ సినిమాలో హీరోయిన్గా ఆమె ఎంపిక కూడా ఖరారైందని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించనుంది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఒకప్పటి సీనియర్ నటి శోభన తిరిగి ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు సమాచారం. శోభన అనగానే అందరికీ ఫ్యామిలీ రోల్స్ గుర్తుకొస్తాయి. అంతలా ఆమె ఫ్యామిలీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు రామ్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

ఈ సినిమాలో రామ్ కి అమ్మ పాత్రలో శోభన నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బోయపాటి శ్రీను కథ మరియు ఆమె పాత్ర వివరించగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శోభన మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో ఆమె ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. నిజానికి శోభన గతంలో సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండేది. కాదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో బోయపాటి, రామ్ కాంబో సినిమాలో మోడ్రన్ మదర్ గా అలరించడానికి సిద్ధమయ్యింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: