ఆ డైరెక్టర్ తో ఒక్క ఛాన్స్ అంటున్న పూర్ణ..?

Anilkumar
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో పూర్ణ కీలక పాత్రలో నటించి ఆడియన్స్ ని మెప్పించింది. వచ్చిన అవకాశాలను అందుకుంటూ అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది పూర్ణ.అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె  పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇంస్టాగ్రామ్ లో ఈ అఖండ బ్యూటీని మిలియన్స్ లో ఫాలో అవుతుండగా…ఇక వాళ్ళ దాహాన్ని తన అందాలతో తీర్చేస్తున్నారు.అయితే తాజాగా జరిగిన 'విచిత్రన్‌' ఆడియో రిలీజ్‌ వేడుకలో పూర్ణ పాల్గొని ప్రసంగిస్తూ, ''బాలా దర్శకత్వంలో నటించాలన్నది నా చిరకాల కోరిక.

అంతేకాదు అది ఇంకా నెరవేరలేదు. కాగా కానీ, ఆయన నిర్మాతగా నిర్మించిన చిత్రంలో నటించే అవకాశం వచ్చింది., ఈ సభాముఖంగా దర్శకుడు బాలాకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.నాకు బాలా దర్శకత్వంలో నటించాలని ఉంది.అంతేకాదు ఇది కొన్నేళ్ళ కల. అయితే ఖచ్చితంగా ఆయన నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ఈ విషయాన్ని బహిరంగంగానే సభా వేదికపై నుంచే విఙ్ఞప్తి చేస్తున్నాను'' అని కోరింది.ఇకపోతే పూర్ణకి మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ, ఆమె పెద్ద చిత్రాలలో పని చేయాలని ఎంతగానో ఆశపడుతుంది.ఇదిలా ఉండగా లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు.

అయితే కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు. అయితే ఓటిటి రిలీజ్ 3 రోజెస్ తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . అంతేకాదు దింతోపాటు కామెడీ... రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు.అంతేకాకుండా  వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు.అయితే  ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. ఇకపోతే తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. అయితే డిజిటల్ రంగం అత్యంత వేగంగా విస్తరించుకుంటూ పోతుండగా, మంచి అవకాశాలు పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: