డిజే టిల్లు సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నేహా శెట్టి..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే కొంత మంది విజయాలను అందుకోలేక పోయినప్పటికీ కావలసిన క్రేజ్ మాత్రం సంపాదించుకుంటారు,  అలా మొదటి సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఆ హీరోయిన్ లకు ఆ తర్వాత కూడా వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అలా మొదటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేక పోయినప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించుకుని ఆ తర్వాత సినిమా వరుస క్రేజీ సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ లలో స్నేహ శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి.  

ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన గల్లీ రౌడీ సినిమాలో నేహా శేట్టి హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.  ఇది ఇలా ఉంటే తాజాగా నేహా శెట్టి,  సిద్ధు జొన్నలగడ్డ హీరో గా తెరకెక్కిన డీజే టిల్లు మూవీ లో హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా  ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను సంపాదించుకొని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.  ఈ సినిమా ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది,  ఈ సినిమాలో తన అందంతో,  నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన నేహా శెట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు తక్కుతున్నట్టు వార్తలు వస్తున్నాయి,  ఇలా డిజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ అవ్వడం తో నేహా శెట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: