'జనగణమన' కోసం హీరోయిన్ ని లాక్ చేసిన పూరీ..?

Anilkumar
దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు ఈయన.పూరి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి టెంపర్ సినిమాను చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక . ఆ తరువాత పూరి జగన్నాథ్ కు సరైన సక్సెస్ రాలేదు. అంతేకాదు దీని తరువాత హీరో రామ్ పోతినేని తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.అయితే ఆ సినిమా సక్సెస్ అవడంతో ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో కలసి లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఇటీవల పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను దాదాపుగా 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఒక వీడియో ని విడుదల చేసింది చిత్ర బృందం.ఇక  ఈ సినిమా తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను తెరకెక్కించడమే అని తెలిపాడు.అంతేకాదు ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడమే తన డ్రీమ్ అని తెలిపారు పూరి జగన్నాథ్.

ఇక ప్రస్తుతం ఆ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నట్టు పూరి జగన్నాథ్ తెలిపారు. మొదట ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కించాలని అని అనుకున్నప్పటికీ కొన్ని  కారణాల వల్ల కుదర లేదట. అందుకే ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ని పూరి జగన్నాథ్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు బీటౌన్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఇప్పటికే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగులో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తుండగా..ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: