ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సినిమాలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఒకటి, ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూండగా రాధిక, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు, ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు, ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. కిషోర్ తిరుమల ఇది వరకే నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్ లాంటి మంచి మంచి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు, ప్రస్తుతం కిషోర్ తిరుమల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా కిషోర్ తిరుమల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు... అందులో భాగంగా కిషోర్ తిరుమలకు ఈ కథను ఇంతకుముందు వెంకటేష్ గారితో చేయాలనుకున్నదేనా అనే ప్రశ్న ఎదురైంది... ఈ ప్రశ్నకు కిషోర్ తిరుమల సమాధానమిస్తూ... విక్టరీ వెంకటేష్ కు చెప్పిన కథ ఇది కాదు, వెరీ టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలని అని అనుకున్నాను. హీరో పాత్ర కాస్త దగ్గరగా ఉన్నప్పటికీ కథ మాత్రం భిన్నంగా ఉంటుంది అని తిరుమల కిషోర్ తెలియజేశాడు, బ్యాక్ డ్రాప్ అదే కానీ కథను మార్చమని తిరుమల కిషోర్ తెలియజేశాడు, ఇలా కిషోర్ తిరుమల తాజా ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల అవుతున్న ఫిబ్రవరి 25 వ తేదీన భీమ్లా నాయక్, గని సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.