ఆ స్టార్ హీరో సినిమాలు చూసి ఇండ్రస్టీ పై ఇష్టం పెంచుకున్న డీజే టిల్లు హీరోయిన్..!

Anilkumar
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది  నేహా శెట్టి.  అయితే ఈ సినిమాలో ఈ బ్యూటీ రాధిక పాత్రలో కనిపించనుంది.ఇక ఈ   ‘డిజె టిల్లు’సినిమా  ఈనెల 12 న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించింది.  ఇక ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.అయితే నిర్మాతగా సూర్యదేవర నాగ వంశీ... ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మరియు చిత్రంలో నటించిన తన అనుభవాలను తెలిపింది నేహా శెట్టి.  

అయితే ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే నటి కావాలనే కోరిక ఉండేది.... మరియు హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి ఇండస్ట్రీ పై ఇష్టాన్ని పెంచుకున్నాను... ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ కూడా చేశాను...తరువాత మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాను.., తెలుగులో పూరీ జగన్నాథ్ గారి దగ్గర నుంచి పిలుపు రావడం జరిగింది. ఆ తర్వాత మెహబూబా చిత్రంలో నటించాను.ఇక  ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను.  ఇక అక్కడి నుండి వచ్చిన తర్వాత  గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లో నటించాను.

ఇదిలా ఉంటే ప్రస్తుతం  “డిజె టిల్లు”  సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పింది.సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే ఎవరన్నా అలా కాదనుకుంటారు... ఇక పోతే నేను ఈ సినిమా చేయడానికి ఇది ఒక్కటే కారణం కాదు...మంచి స్క్రిప్ట్ ఉండడం సిద్ధూ, విమల్ క్రియేటివ్ గా సినిమాను, ఫన్ గా డిజైన్ చేయడం... మీరు ట్రైలర్ లో డైలాగ్స్ వినే ఉంటారు కదా... ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా అని అంటుంది ఈ భామ.  ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ మీ అందరూ చూసే ఉంటారు..ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ.... ఈ సినిమా లో  అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది... ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉంటాయి... అంటూ తెలిపింది నేహా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: