ఆర్.ఆర్.ఆర్ కి అడ్డొస్తున్న మహమ్మారి.. మరి ఎలా..?
రాజమౌళి తండ్రి కె .వి .విజయేంద్ర ప్రసాద్ రాసిన ఒక మూల కథను తీసుకొని ఈ చిత్రానికి స్క్రిప్ట్ను అందించడం జరిగింది. 1920వ సంవత్సరంలో కథాంశం విప్లవకారులు ఇద్దరూ తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం చేసే యుద్ధాన్ని మనం ఈ సినిమాలో చూడవచ్చు. 2018 లోనే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడడం గమనార్హం. ఈ సంవత్సరం జూలై 30వ తేదీన చిత్రం విడుదల చేయాలని అనుకున్నా కరోనా కారణంగా షెడ్యూల్ చేయలేకపోయారు. అయితే తరువాత జనవరి 7 2022 వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది .
కానీ ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఈ సినిమా విడుదలయ్యే సమయానికి కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా మారుతుందని వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్ తో సహా మిగతా రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. ఒకవేళ కరోనా సమయంలోనే చెప్పిన డేట్ వెనుక ఈ సినిమాను విడుదల చేస్తే నిర్మాతలు బాగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఈ సినిమా ఏమాత్రం లాభాల బాటపడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.