అభిమానులను ఆనందపరిచేందుకు రష్మిక కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ కు సరికొత్త ట్రీట్..!

VUYYURU SUBHASH
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు తమ అభిమానులతో మాట్లాడటం ఎక్కువ చూస్తున్నాం. కనీసం నెలకు ఒక్కసారైన స్టార్ హీరో,హీరోయిన్ లు లైవ్ లోకి వచ్చి.. తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇక ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాది కన్నడ బ్యూటీ రష్మిక మందన. తన అందం తో అభినయంతో కొట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ చిన్నది..ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా అమ్మడు ఎప్పుడు అభిమానుల కోసం టైం కెటాయిస్తూ ఉండడం గమనార్హం.
అయితే, తాజాగా ఈ అమ్మడు తనను మెచ్చే నచ్చే అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ర‌ష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఇదే  క్రేజ్ ను క్యాష్ చేసుకుంది పాపులర్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ . రష్మిక అభిమానుల కోసం సరికొత్త ప్రణాళికను ప్లాన్ చేసింది. మెక్డొనాల్డ్స్ నవంబర్ 19 నుంచి రష్మిక పేరుతో ఓ స్పెషల్ ట్రీట్ ను ఆమె ఫ్యాన్స్ కోసం అందించడానికి పక్క ప్లాన్ రచించింది. మెక్‌డొనాల్డ్స్ ఇండియా రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు ‘ది రష్మిక మీల్’ అనే ఓ స్పెషల్ మీల్ కేటగిరీని రూపొందించి..అధికారిక ప్రకటన చేసింది.
ఇక ఈ"ది ర‌ష్మిక మీల్" భోజనంలో కన్నడ సోయగం రష్మికకు ఎంతో ఇష్టమైన ఫుడ్ ఐటెంస్ అన్నీ ఉన్నాయట. మెక్ స్పైసి, ఫ్రైడ్ చికెన్, మెక్ స్పైసి చికెన్ బర్గర్, పెరి పెరి ఫ్రైస్, ..ఇలా ఒక్కటి రెండు కాదు బోలెడు ఉన్నాయి. ఇక ఈ ప్రత్యేకమైన ‘ది రష్మిక మీల్’ అసోసియేషన్ గురించి రష్మిక  మాట్లాడుతూ..తన అభిప్రాయని తెలియజేసింది. మెక్‌డొనాల్డ్స్  ఫుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని..ఆమెకు చాలా కంఫర్ట్ గా ఉంటుందని తెలిపింది. జీవితంలో కొన్ని చిన్న చిన్న ఆనందాలు  సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకోవడానికి పెద్దలకి అయినా, చిన్న వాళ్లకు అయినా మెక్‌ఫ్లరీ మరొక మార్గం అన్నట్లు చెప్పుకోచ్చింది. తనకిష్టమైన మెక్‌డొనాల్డ్స్ ఫేవరెట్‌లను తన అభిమానులతో పంచుకోవడం పట్ల ఎంతో హ్యాపీగా ఉన్నట్లు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: