ఇరవై రోజుల్లో కథ రాసుకొని ముప్పై రోజుల్లో సినిమా పూర్తి చేశా...మారుతి..!

Pulgam Srinivas
టాలీవుడ్ దర్శకుడు మారుతి ఈ రోజుల్లో లాంటి చిన్న సినిమా తో దర్శకుడి గా పరిచయమై  ఆ తర్వాత బస్ స్టాప్, బలే బలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, ప్రతి రోజు పండగే లాంటి సినిమా లతో తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా మారాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితం గోపీచంద్ హీరో గా రాశి ఖన్నా హీరోయిన్ గా యువి క్రియేషన్స్ బ్యానర్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా ను ప్రారంభించాడు. అయితే ఈ సినిమా ప్రారంభించి కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత దేశంలో కరోనా విజృంభించడంతో ఈ సినిమా ను కొంత కాలం పక్కన పెట్టిన మారుతి ఆ గ్యాప్ లో సంతోష్ శోభన్ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి అనే సినిమా షూటింగ్ ని ప్రారంభించి చకచకా పూర్తి చేశాడు.

 తాజా గా ఈ సినిమాబిను కూడా విడుదల చేసిన మారుతి ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ఇరవై రోజుల్లో మంచి రోజులు వచ్చాయి సినిమా కథ ను రాశాను. 30 రోజుల్లో ఈ సినిమా ను పూర్తి చేశాను అని దర్శకుడు మారుతి తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజా గా పక్కా కమర్షియల్ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్  జనాల నుండి అదిరి పోయే రెస్పాన్స్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా, ఈ సినిమా పై ఉన్న అంచనాలను కూడా పెంచేశాయి. పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ అదిరిపోయే లుక్ తో అదరగొడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: