పూరీ రెండు సార్లు ఆకట్టుకోలేక పోయాడు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. కాగా ఇటీవలే ఆయన తనయుడు హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ సినిమాగా నిలిచి పోయింది. పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్ప్లే మాటలు అందించారు. అయితే ఆయన స్టోరీ తన కొడుకు ఏమాత్రం సరిపోకపోవడం, చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా మెపించకపోవడం వంటివి చూస్తుంటే పూరి జగన్నాథ్ మరొకసారి తన కొడుకు కు హిట్ ఇవ్వలేక పోయాడన చెప్పాలి.

పూరి జగన్నాథ్ కొన్ని సంవత్సరాల క్రితం తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ని కూడా హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంకా ఆ టైంలో  మంచి ఊపు మీద ఉన్నాడు పూరి జగన్నాథ్. అయితే మంచి ఊపు మీద ఉన్నప్పుడే సాయిరామ్ శంకర్ ను హీరోగా నిలబెట్టే లేకపోయాడు పూరీ. ఇప్పుడు పూరి జగన్నాథ్ కొంత డౌన్ టైం లో ఉన్నాడు కాబట్టి కొడుకును హీరోగా నిలబెట్టే క్రమంలో ఆయన తో సినిమాలు చేసి హిట్స్ ఇవ్వలేకపోతున్నాడు.  ఇది మొదటిసారి కాదు మెహబూబా సినిమాతో ఆకాష్ ను హీరోగా పరిచయం చేసిన సందర్భంలో పూరి ఆ సినిమా తో బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో ఆయన ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాడు.

రవితేజ లాంటి హీరో ని పునీత్ రాజ్ కుమార్ మరియు రామ్ చరణ్ లాంటి వారసులని సినిమా పరిశ్రమకు పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన పూరి జగన్నాథ్ తన సొంత తమ్ముడు సొంత కొడుకు విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఆకాష్ తో చేసిన తొలి సినిమాకు దర్శకత్వం వహించిన ఆయన ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు రొమాంటిక్ సినిమాకి మరొక డైరెక్టర్ ను పెట్టినా కూడా ఆకాష్ కు ఏ మాత్రం అదృష్టం వరించలేదనే చెప్పాలి. రొమాంటిక్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ తప్ప మరేవీ కూడా ప్రేక్షకులను అలరించే విధంగా లేవని ఇప్పటికే రుజువు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆకాష్ పూరి ఏ విధమైన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: