పూజ హెగ్డే ప్రభాస్ ల వార్తలు విని టెన్షన్ పడుతున్న అభిమానులు !

Seetha Sailaja
‘రాథే శ్యామ్’ ఫలితం గురించి ప్రభాస్ అభిమానులు ఇప్పటికే తెగ టెన్షన్ పడుతున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ టీజర్ మరీ క్లాసిక్ గా ఉంది అని కామెంట్స్ రావడంతో మరో టీజర్ ను విడుదల చేసి అభిమానుల అసంతృప్తికి చెక్ పెట్టాలని ఈమూవీ నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులలో ఈమూవీలో నటించిన పూజా హెగ్డే ప్రభాస్ ల మధ్య ఏదో జరిగింది అంటూ వస్తున్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడ ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి. ప్రభాస్ తన తోటి నటీనటులతో ముఖ్యంగా తన హీరోయిన్స్ తో చాల సంస్కారవంతంగా ఉంటాడని చెపుతూ ఉంటారు. అలాంటిది వీరిద్దరి మధ్య ఎందుకు చెడింది అంటూ చాలమంది హడావిడి చేసిన ఈగాసిప్పుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.

ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం ‘రాథే శ్యామ్’ షూటింగ్ చివరి దశలో కొన్నిరోజులు ప్రభాస్ పూజా హెగ్డే లు అసలు మాట్లాడుకోలేదని ఆఖరికి వారు ఒకరికి ఒకరు ఎదురు పడలేదనీ అంటున్నారు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా వేరువేరుగా గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరించి తరువాత ఫిక్స్ చేసుకున్నారని గాసిప్పుల హడావిడి.

ఇలా వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడటానికి చివరిలో ఈమూవీకి సంబంధించిన షూటింగ్ రోజులలో పూజా హెగ్డే ప్రవర్తించిన తీరు అంటున్నారు. షూటింగ్ స్పాట్ కు టైమ్ కు రాకుండా గంటలగంటల కొద్దీ ప్రభాస్ ను వెయిట్ చేసేలా పూజా హెగ్డే ప్రవర్తించిందని దీనితో అసహనానికి లోనైన ప్రభాస్ ఆమెతో మాట్లాడటం మానేసాడని అంటున్నారు. అయితే ఈవార్తలు ఏమి నిజం కాదని ఈమూవీ యూనిట్ వర్గాలు ఖండిస్తున్నప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈమూవీ ప్రమోషన్ లో పూజా హెగ్డే ఉండితీరాలి. దీనితో చిన్నచిన్న గ్యాప్ లు ఉన్నప్పటికీ అవి ఈమూవీ రిలీజ్ లోపున సద్దుబాటు జరగకపోతే అసలకు మోసం వస్తుంది కదా అంటూ ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: