నాట్యం సినిమాపై ఉపరాష్ట్రపతి ఏమన్నారో తెలుసా..?
తాజాగా నాట్యం సినిమాను చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంశలు కురిపించారు. ఈ చిత్రబృందానికి ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిని సంధ్యారాజు నటించిన నాట్యం చిత్రంపై పొగడ్తలు కురిపించారు. అసలు నాట్యం హీరోయిన్ సంధ్యారాజు ఎవరని..? ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు హీరో రామ్ చరణ్ హాజరు కావడం ఏంటి.? ఎన్టీఆర్ టీజర్ను విడుదల చేయడం ఏంటని..? అందరూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఉపరాష్ట్రపతితో పాటు చిరంజీవి, బాలకృష్ణ, రామ్చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు ఈ సినిమా బృందాన్ని అభినందించారు.
అంతగా పేరులేని సంధ్యారాజు హీరోయిన్గా పరిచయం అవుతున్న తరుణంలో ఆమెకు రామ్చరణ్ సతీమణి ఉపాసన, హీర్లు ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్రహీరోలు మద్దతు ఎందుకు ఇస్తున్నారని చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా సంధ్యారాణి ఆఫీస్ వద్దకు వెళ్లి టీజర్ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా మారింది. అప్పటి నుంచి అందరూ ఈ సినిమాపై చర్చించుకుంటున్నారు. సంధ్యారాజు కూచికూడి నృత్యకారినితో పాటు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు కావడం విశేషం. అదేవిధంగా మరో బిజినెస్ మ్యాన్కు కోడలు.
ప్రముఖ వ్యాపారవేత్త మల్టీ మిలియనీర్ రామ్ కో గ్రూపు ఛైర్మన్ పి.ఆర్.వెంకట్రామ రాజా కూతురు. అదేవిధంగా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు కోడలు. రామ్ కో గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్ సంస్థకు సంధ్యారాజు మేనేజింగ్ డైరెక్టర్గా కూడ పని చేస్తున్నారు. ఆమె వెంపటి చిన్న సత్యం వద్ద నాట్యం నేర్చుకుంది. ఇప్పటివరకు 1000 కి పైగా ప్రదర్శనలు చేశారు. అందుకే ఆమెకు అందరూ ఇంత ప్రాధన్యం ఇచ్చారని తెలుస్తోంది.