పూరీ పరిచయం చేసిన హీరోయిన్ లు వీరే!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాద్ కి సెపరేట్ స్టైల్ ఉంది. ఆయన సినిమాలలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో హీరోయిన్లకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఆయన కెరీర్లో ఎక్కువగా స్టార్ హీరోలతో పని చేయగా పూరి జగన్నాథ్ హీరోయిన్ ల విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా కొత్త హీరోయిన్ల తోనే పని చేశాడు. ఆ విధంగా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో చేసిన సినిమాలలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న లైగర్ సినిమా రాబోతుండగా బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా బద్రి తో హీరోయిన్ గా రేణు దేశాయ్ ను పరిచయం చేశాడు. ఆ సినిమా వల్ల ఏర్పడిన పరిచయం తోనే పవన్ కళ్యాణ్ ను ఆమె పెళ్లి చేసుకుంది. అదే సినిమాలో మరో హీరోయిన్ గా చేసిన అమీషా పటేల్ ను కూడా పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేసింది అమీషా పటేల్.

ఇక జగపతిబాబు హీరోగా నటించిన బాచి సినిమాతో నీలాంబరి అనే కథానాయిక పరిచయం కాగా ఈ ఒక్క సినిమాకే ఆమె పరిమితం అయిపోయింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో తను రాయ్ హీరోయిన్ గా పరిచయం కాగా ఈమె ఒకటి రెండు సినిమాల్లోనే నటించింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరూ పెద్ద పెద్ద హీరోలతో నటించిన రక్షిత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కన ఇడియట్ సినిమాతో పరిచయం అయింది.  అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తో అసిన్,  143 సినిమా తో సమీక్ష ,సూపర్ సినిమా అనుష్క మరియు అయేషా టకియా, దేశముదురు సినిమాతో హన్సిక, చిరుత సినిమా తో నేహా శర్మ, ఏక్ నిరంజన్ తో కంగనా రనౌత్, నేనింతే సినిమా తో సియా గౌతమ్ హార్ట్ ఎటాక్ మూవీ తో ఆదా శర్మ, లోఫర్ సినిమా తో దిశా పటాని, పైసా వసూల్ సినిమా తో ముస్కాన్ వంటి వారిని ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: