మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన..!

Pulgam Srinivas
నేషనల్ క్రాస్ రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో మోస్ట్ బిజి యెస్టూ హీరోయిన్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. అక్కడ మంచి  గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా  నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా హిట్ కావడంతో పాటు రష్మిక మందన కూడా మంచి పేరును తీసుకువచ్చింది. ఇలా మొదటి సినిమా మంచి హిట్ కావడంతో అదే జోష్ లో నేషనల్ రష్మిక వరుస బెట్టి తెలుగులో గీతగోవిందం, డియర్ కామ్రేడ్  సరిలేరునికెవరు వంటి సినిమాల్లో నటించి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది.

ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే క్రేజీ ప్రాజెక్టులు కూడా నటిస్తోంది. ఇలా సినిమాలతోపాటు  రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆమె ఓ సినిమా చేస్తుంది అనే వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్వప్న సినిమా - వైజయంతీ మూవీస్ వారు, దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ఒక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం కొంత కాలం క్రితం రష్మిక మందన సంప్రదించగా తాజాగా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: