సలార్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ?
పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సలార్' చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని ఫోర్త్ షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రుతి తన టీమ్ తో కలిసి చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో శృతి చాలా క్లోజ్ అని తెలుస్తోంది. తాజాగా శృతి సోషల్ మీడియా వేదికపై తన హాబీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ఇబ్బంది పెట్టడమే అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఈ విషయం అటుంచితే ఈ స్టార్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్ లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శృతి టాలెంట్ కు ఫిదా అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా కథ కి హీరోయిన్ శృతి హాసన్ అయితేనే సరిగ్గా సెట్ అవుతుందని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే లేటెస్ట్ టాపిక్. మరి శృతి హాసన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ లో కనిపిస్తుందో లేదో చూడాలి.