అక్కడ పాట పడబోతున్న మహేష్

Vimalatha
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తాను నటిస్తున్న "సర్కారు వారి పాట" అనే యాక్షన్ ఎంటర్ టైనర్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ మేరకు నిరంతరాయంగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే గత వారం నుంచి మహేష్ సినిమాల కన్నా ఎక్కువగా ఇతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల "సర్కారు వారి పాట" షూటింగ్ సెట్ కు మాజీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రావడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు శశిధరూర్ మహేష్ బాబుని కలిశారు. గల్లా జయదేవ్ మహేష్ బంధువులన్న విషయం తెలిసిందే. తరువాత ఓ లైఫ్ స్టైల్ క్లబ్ ను ఓపెన్ చేసి కెమెరాలకు మహేష్ ఫోజులిచ్చారు. మరోవైపు "సర్కారు వారి పాట" తో పాటు తన కమర్షియల్ యాడ్స్ కు కూడా డేట్స్ కేటాయిస్తున్నారు ఈ స్టైలిష్ హీరో. తాజాగా ఆయన నటించిన ఒక పాన్ యాడ్ రిలీజ్ అయింది. అందులో మహేష్ తో పాటు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ షాప్ కూడా కనిపించడం విశేషం.
ఇక అసలు విషయం లోకి వెళ్తే... ప్రస్తుతం "సర్కారు వారి పాట" షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి అవుతుంది. ఆ తర్వాత తదుపరి షెడ్యూల్ ను కొంత గ్యాప్ తీసుకొని అక్టోబర్ రెండవ వారంలో ప్రారంభించనున్నారు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ ను మాత్రం ఇండియాలో కాకుండా యూరప్ లో చిత్రీకరిస్తారని సమాచారం. దీంతో "సర్కారు వారి పాట" మూవీ షూటింగ్ 90 శాతం పూర్తవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన "సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్" అనే టీజర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈ బ్లాస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: