బాలయ్య ఫోటోని ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్న హీరోయిన్..?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూర్ణ మరో కీలక పాత్రలో  కనిపించనుంది.అయితే ఈ సందర్భంగా బాలయ్య తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది పూర్ణ.బాలకృష్ణ గారు తోటి వ్యక్తులను ఎంతో గౌరవిస్తారని,పని పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారని చెప్పి ఆయన్ను 'సింహం' అంటూ అభివర్ణించింది.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ, తనకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయని తెలిపింది పూర్ణ.

ఇక ఆయన గురించి చాల విన్నానని..చాలా ఇంటర్వ్యూలు చూశానని..అయితే మొదటిసారి కలిసినప్పుడు ఆయన వెంటనే లేచి ' పూర్ణ గారు ఎలా ఉన్నారు' అంటూ అడిగినట్లు చెప్పుకొచ్చారు.బాలయ్య తనతో మాట్లాడిన విధానం,తనకు ఇచ్చిన గౌరవం చూసి ఆశ్చర్యపోయానని..తన తోటి వారిని అంతలా గౌరవించే వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదని పేర్కొన్నారు పూర్ణ.అంతేకాకుండా ఇంకా మాట్లాడుతూ "నా ఫోన్ వాల్ పేపర్ గా మీ ఫోటో పెట్టుకుంటానని బాలయ్యకు చెప్పానని..ప్రతీ రోజు లేవగానే ఆయన ఫోటో చూసి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా సింహం లా పని చేయాలి.అసలు బాలయ్య లాంటి వ్యక్తిని  ఇంతవరకు చూడలేదు.నేను కూడా 'అది బాలేదు..ఇది బాలేదు' అని కంప్లైంట్ చేస్తా..

కానీ బాలకృష్ణ గారు అలా కాదు.ప్రతీ రోజు సెట్ కి వస్తారు.డైరెక్టర్ ఏమి చెప్పినా అది వింటారు.మరో మాట కూడా మాట్లాడరు.బాలయ్య తో మరిన్ని సినిమాలు చేసి,ఆయన నుంచి మరింత స్పూర్తిని పొందాలని" పేర్కొన్నారు పూర్ణ.ఇక పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు శ్రీకాంత్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.ఇక జగపతిబాబు సైతం ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలను తారా స్థాయికి చేర్చాయి. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుస్తున్న సమాచారం ప్రకారం దసరా కానుకగా ఈ సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది...!!




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: