త్రివిక్రమ్ తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ సినిమా?

P.Nishanth Kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీతగోవిందం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కథపై కసరత్తులు చేసి మరీ పరశు రామ్ మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తున్నాడు. ఆర్థిక నేరాలకు పాల్పడే బడా బాబులను కొట్టి పేదలకు ఆ డబ్బును పంచి పెట్టే గొప్ప పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నాడట. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా అది ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

ఇకపోతే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు చేయబోయే చిత్రలు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28 వ సినిమా చేస్తుండగా 29 వ సినిమా ను రాజమౌళితో చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళుతుండగా మొదటగా త్రివిక్రమ్ సినిమా ఆ తర్వాత రాజమౌళి సినిమాలు విడుదల కానున్నాయి. ఏదేమైనా ఇతర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా మహేష్ తన సినిమాలను క్రేజీ డైరెక్టర్లతో చేసే విధంగా లైనప్ ఏర్పరుచుకున్నాడు.

అయితే ఈ రెండు సినిమాల తర్వాత కూడా త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఓ స్టార్ డైరెక్టర్ తో చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయాలని మహేష్ బాబు చూస్తున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో స్పైడర్ సినిమా రాగా అది ప్రేక్షకులను బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో మహేష్ తో మరో సినిమా చేయాలని భావించిన మురుగదాస్ మంచి కథను రెడీ చేయగా మహేష్ బాబు కోసం ఇన్నాళ్లు వేచి చూశాడు. ఇప్పుడు మహేష్ తో సినిమా చేసే అవకాశం దొరకడంతో వెంటనే సినిమా ను మొదలుపెట్టి మహేష్ కు ఓ సూపర్ హిట్ సినిమాను అందించాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మురుగదాస్ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: