ఆ దర్శకుడి సినిమాలో అలాంటి పాత్రలో కనబడబోతున్న రష్మిక మందన..!

Pulgam Srinivas
నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' తో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా కన్నడ పరిశ్రమలో మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు కన్నడ ఇండస్ట్రీ సహా ఇతర భాషల నుండి కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన  'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా డియర్ కామ్రేడ్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు  వంటి పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది.

ప్రస్తుతం రష్మిక మందన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాతో పాటే శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మందన మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో ఉన్న లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అందాల రాక్షసి , టైగర్ సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్ 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున హీరోగా 'మన్మధుడు టు' సినిమాకు  దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఈ దర్శకుడు రష్మిక మందన ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ చాలా బాగా నచ్చడంతో రష్మిక కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: