కంగనా కోరికను ప్రభాస్ తెరుస్తాడా...?

murali krishna
బాలీవుడ్ లో ప్రస్తుతం భారీ మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో కంగనా రనౌత్ కూడా ఒకరని తెలుస్తుంది.. కంగనా నటించిన తలైవి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారట. తెలుగులో కంగనా రనౌత్ ప్రభాస్ కు జోడీగా ఏక్ నిరంజన్ అనే సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఏక్ నిరంజన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఏక్ నిరంజన్ ఫ్లాప్ కావడంతో కంగనా రనౌత్ కు ఎక్కువ సంఖ్యలో తెలుగులో సినిమా ఆఫర్లు రాలేదని తెలుస్తుంది.తమిళంలో జయంరవికి జోడీగా ధూమ్ ధామ్ అనే సినిమాలో కంగనా రనౌత్ నటించారట. ఆ సినిమా కూడా తమిళంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస విజయాలతో కంగనా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. తెలుగులో తనకు ఛాన్స్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ను మరో ఛాన్స్ అడుగుతున్నానని కంగనా తెలిపారని సమాచారం.టాలీవుడ్ లో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని తన మనసులో మాట చెప్పింది కంగనా.
ప్రభాస్ కు జోడీగా మరో ఛాన్స్ ఇప్పించాలని పూరీని కోరుతున్నానని కంగనా అన్నారని సమాచారం.కంగనా కోరికను పూరీ జగన్నాథ్ మరియు ప్రభాస్ తీరుస్తారో లేదో చూడాల్సి ఉందని తెలుస్తుంది. జయలలిత పాత్రలో నటించడానికి తాను చాలా కష్టపడ్డానని ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయంగా నిలుస్తుందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారని సమాచారం. తనకు మోడీ హయాంలో మాత్రమే కాదని కాంగ్రెస్ హయాంలో కూడా అవార్డులు వచ్చాయని కంగనా రనౌత్ కామెంట్లు చేశారని సమాచారం.మరి ఈ లేడీ ఫైర్ బ్రాండ్ కు యంగ్ రెబల్ స్టార్ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: